ఏపీ బంద్ ప్రశాంతంగా…!!

ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవర్చలేదంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ [more]

Update: 2019-02-01 04:08 GMT

ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవర్చలేదంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం బంద్ కు సంఘీభావం ప్రకటిస్తూనే కేవలం నిరసనలను మాత్రమే వ్యక్తం చేయాలని, ఎలాంటి ఆందోళనలు నిర్వహించకూడదని ఆ పార్టీ పేర్కొంది. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలంతా నల్ల చొక్కాలతో హాజరై తమ నిరసనలను తెలియజేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News