ఆళ్ల సంచలన వ్యాఖ్యలు.. ఆ స్కామ్ లో ఆయన..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని గురించి ప్రపంచానికి తెలియకముందే మధ్యవర్తుల ద్వారా చంద్రబాబు భూములు కాజేశారని వైసీపీ ఎమ్మెల్యే [more]

Update: 2021-07-04 07:03 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని గురించి ప్రపంచానికి తెలియకముందే మధ్యవర్తుల ద్వారా చంద్రబాబు భూములు కాజేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసైన్డ్ మెంట్ ల్యాండ్ స్కామ్ కు సంబంధించి అన్ని ఆధారానలు తాను సేకరించానని, వాటిని సీఐడీ అధికారులకు అప్పగిస్తానని తెలిపారు. దళితుల భూములను కాజేసిన తెలుగుదేశం పార్టీ నేతలను వదలిపెట్టబోనని తెలిపారు. ఈ స్కామ్ లో ఒక రిటైర్డ్ అధికారి పాత్ర ఉందని ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు, టీడీపీ నేతలు కలసి ఈ స్కామ్ చేశారన్నారు. తాను సేకరించిన ఆధారాలతో వారికి శిక్ష పడక తప్పదని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారులని ఆయన అన్నారు.

Tags:    

Similar News