రాచమల్లుది గుండెలు తీసే మనస్తత్వం

వైసీపీది వినకుంటే ఖతం చేసే మనస్తత్వమని బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిది గుండెలు తీసే మనస్తత్వం అన్నారు. టీడీపీ బీసీ నేత [more]

Update: 2020-12-30 07:20 GMT

వైసీపీది వినకుంటే ఖతం చేసే మనస్తత్వమని బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిది గుండెలు తీసే మనస్తత్వం అన్నారు. టీడీపీ బీసీ నేత నందం సుబ్బయ్య హత్య దారుణమని ఆదినారాయణరెడ్డి అన్నారు. వైసీపీ చెప్పిన మాట వినకుంటే హత్యలు చేస్తారన్నారు. దీని వెనక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, హత్యలు పెరిగిపోయాయని ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించాడనే సుబ్బయ్యను హత్య చేశారన్నారు.

Tags:    

Similar News