ఏపీలో కేసులన్నీ అక్కడి నుంచే ఈ రోజు కూడా?

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 90 శాతం చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవే. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2020-05-16 06:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 90 శాతం చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవే. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,205కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో కొత్తగా నమోదయిన కేసుల్లో చిత్తూరు 9, నెల్లూరు, 9, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 600కు చేరుకుంది. ఏపీలో మరణాల సంఖ్య 49కు చేరుకుంది.

Tags:    

Similar News