మ్యాజిక్ ఫిగర్‌ చేరిన కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 224 తొలి రౌండ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది

Update: 2023-05-13 03:42 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 224 తొలి రౌండ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ దాటేసింది. ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు నిజమవుతాయని చెబుతాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ 116 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 88 స్థానాల్లో ఉంది. జేడీఎస్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది.

తొలి రౌండ్‌లోనే...
అయితే ఇది తొలి రౌండ్ మాత్రమే. అయితే ఇదే ట్రెండ్ కౌంటింగ్ పూర్తయ్యేంత వరకూ కొనసాగుతుందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గాలి జనార్థన్ రెడ్డి దంపతులు ఆధిక్యంలోకి వచ్చారు.


Tags:    

Similar News