పాదయాత్రకు స్వల్ప విరామం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పాదయాత్రకు విరామం ప్రకటించారు

Update: 2022-07-07 02:58 GMT

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాలళులర్పించేందుకు పాదయాత్రకు విరామం ప్రకటించారు.

తిరిగి పదో తేదీ నుంచి..
వైఎస్సార్ ఘాట్ లో ఈ నెల 8వ తేదీన ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తిరిగి ఈ నెల 10వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల సూర్యాపేట జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.


Tags:    

Similar News