నేడు హైదరాబాద్‌కు అమిత్ షా

ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.

Update: 2023-03-11 02:36 GMT

ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో అమిత్ షా చర్చించనున్నారు. ముఖ్య నేతలు అందుబాటులో ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అందడంతో అమిత్ షా రాక కోసం బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు.

తెలంగాణాలో బలోపేతానికి...
అమిత్ షా స్వయంగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? చేరికలు లేకపోవడంపై కూడా అమిత్ షా నేతలతో చర్చించనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై కూడా ఆయన నేతలతో మాట్లాడనున్నారు. మరోవైపు రేపు అధికారిక కార్యక్రమంలో కూడా అమిత్ షా పాల్గొననున్నారు. సీఐఎస్ఎఫ్ పాసింగ్ అవుట్ పెరేడ్ లో అమిత్ షా పాల్గొంటారు.


Tags:    

Similar News