ఆదిలాబాద్ లో భూ ప్రకంపనలు.. ఆరుబయట జాగారం చేసిన ప్రజలు

Update: 2022-10-13 03:25 GMT

ఆదిలాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలకేంద్రంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం ఉట్నూర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని, రిచర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.0గా నమోదైందని, ఆ ప్రాంతంలో ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. ప్రకంపనలు రావడంతో భయంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు. స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి 11:23 నిమిషాలకు మూడు సెకన్ల పాటు కంపించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా భవనం కంపించినట్లు అనిపించిందని.. అందుకే భయంతో బయటకు పరుగులు తీశామని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయంతో రాత్రంతా జాగారం చేశారు.


Tags:    

Similar News