గోడ దూకి పారిపోయిన ఎస్ఐ

ఎస్‌ఐ తనను పట్టుకోబోయిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా గోడ దూకి పారిపోయాడు.

Update: 2025-11-19 11:50 GMT

ఎస్‌ఐ తనను పట్టుకోబోయిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా గోడ దూకి పారిపోయాడు. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం హసన్‌మహ్మద్‌పల్లి తండా శివారులో నవంబర్ 1న వరికోత యంత్రం బ్యాటరీలను స్థానికులైన పాండు, పరశురాంలు చోరీచేశారు. ఈ విషయమై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 40 వేలు ఇవ్వాలని ఎస్‌ఐ రాజేశ్‌ డిమాండ్‌ చేశాడు. డబ్బుల కోసం ఎస్‌ఐ వేధించడంతో పాండు, పరశురాంలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పాండు నుంచి స్టేషన్‌లో ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా ధికారులు పట్టుకునేందుకు వచ్చారు. వారిని చూసిన రాజేశ్‌ అక్కడి నుంచి తప్పించుకొని గోడ దూకి పరుగుతీశాడు. అయితే ఏసీబీ అధికారులు అతని వెంటపడి టేక్మాల్‌ మార్కెట్‌ సమీపంలో పట్టుకున్నారు.

Tags:    

Similar News