తెలంగాణ మంత్రులకు దొరకని అపాయింట్ మెంట్

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.

Update: 2021-12-19 02:00 GMT

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. నిన్ననే ఢిల్లీకి చేరుకున్న నేతలు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ను కోరారు. కానీ ఇప్పటి వరకూ ఎవరి అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని తెలిసింది.

ధాన్యం కొనుగోలుపై.....
తెలంగాణలో వరిధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పార్లమెంటు సమావేశాల్లోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను కలసి ధాన్యం కొనుగోలు పై స్పష్టత కోరనున్నారు. ఈరోజు, రేపు కూడా మంత్రులు ఢిల్లీలోనే ఉండనున్నారు.


Tags:    

Similar News