ఉత్తచేతులతో తిరిగొచ్చిన మంత్రులు

తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నెల 18న వారు ఢిల్లీ వెళ్లారు.

Update: 2021-12-25 04:07 GMT

తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నెల 18న వారు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే వారికి ఈ విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించలేదు. దాదాపు వారం రోజులు ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ మంత్రులు చివరకు హామీ లేకుండానే వెనుదిరిగారు.

కొనుగోలు చేయకుంటే....?
ఈరోజు తెలంగాణ మంత్రులు హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నుమాత్రమే వారు ఈ వారం రోజుల్లో కలవగలిగారు. ఆయన నుంచి కూడా స్పష్టమైన హామీ లభించలేదు. ధాన్యం కొనుగోలు చేయకుంటే తామే ధాన్యాన్ని తీసుకువచ్చి ఇండియా గేట్ వద్ద పారేసి వెళ్లిపోతామని తెలంగాణ మంత్రులు ఆగ్రహంతో చెప్పారు.


Tags:    

Similar News