ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

Update: 2022-08-30 05:21 GMT

తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. కొద్ది సేపటి క్రితం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద ఒమర్ జలీల్ ఫలితానలు విడుదల చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున కేవలం ద్వితీయ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను మాత్రమే విడుదల చేశామని ఆయన తెలిపారు.

సాయంత్రం మొదటి సంవత్సరం...
ఈ నెల 1వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు తెలంగాణలో నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల్లో మొత్తం 48,816 మంది ఉత్తీర్ణతులయ్యారు. ఈరోజు సాయంత్రం ఇంటర్ మొదటి ఏడాది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి.


Tags:    

Similar News