Telangana : పదో తరగతి విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2024-03-14 11:21 GMT

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకంది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5 నిమిషాల గ్రేస్‌ టైం ఇచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు తెలంగాణలో జరగనున్నాయి.

ఐదు నిమిషాల గ్రేస్ టైం...
పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు ఏ మాత్రం టెన్షన్‌ లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు 18వ తేదీ ఉదయం 9.30 నుంచి ప్రారంభమవుతాయి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గ్రేస్‌టైమ్‌ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.


Tags:    

Similar News