Revanth Reddy : నేడు మూడు నియోజకవర్గాలకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు

Update: 2024-05-10 04:36 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన గత కొద్దిరోజులుగా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో రేవంత్ రెడ్డి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు కాకుండా మిగిలిపోయిన హామీలను అమలు చేస్తామని చెబుతూ ప్రజలను తమ పార్టీ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

రోడ్ షోలతో...
ఈరోజు రేవంత్ రెడ్డి మక్తల్, షాద్ నగర్ , గోషామహల్, నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మక్తల్ లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. అనంతరం మక్తల్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత గోషామహల్ లో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొని క్యాడర్ లో జోష్ నింపనున్నారు.


Tags:    

Similar News