నేడు మహారాష్ట్రకు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు.అక్కడ జరగనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

Update: 2023-03-26 02:28 GMT

kcr, brs, mps, parlament

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మహారాష్ట్రలోని కంథార్ లో ఇప్పటికే బీఆర్ఎస్ కిసాన్ సమితి ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నాందేడ్ సభ విజయవంతం కావడంతో మరోసభను మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. బైల్ బజార్ లో పదిహేను ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దగ్గరుండి గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నారు.

రైతు కోసం...
లోహా కంథార్ పట్టణంలో భారీ ఎత్తున కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నాందేడ్ లో సభ పెట్టిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిందని బీఆర్ఎస్ కిసాన్ సమితి సభ్యులు చెబుతున్నారు. అందుకోసమే రైతుల కోరిక మేరకు మరో సభను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు.


Tags:    

Similar News