ఉద్యోగుల‌ కష్టాలపై పాట రాసి సంస్థకు అంకితం చేస్తాన‌న్నారు.. అంతలోనే.. : సజ్జనర్

ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నివాళులు అర్పించారు.

Update: 2023-08-07 09:55 GMT

ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నివాళులు అర్పించారు. గ‌ద్ద‌ర్‌ను క‌డ‌సారి చూసేందుకు సోమ‌వారం ఎల్బీస్టేడియంకు వెళ్లిన సజ్జనర్.. ఆయ‌న‌ కుటుంబ సభ్యులను పరామర్శించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని సజ్జనర్ గుర్తు చేసుకున్నారు.

నెల రోజుల క్రితం ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారు. అంతలోనే గద్దర్‌ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

గద్దర్ తో త‌న‌కు దశాబ్ద కాలంగా పరిచయం ఉంద‌ని తెలిపారు. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారని జ్క్షాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు. పాటను గద్దర్‌ వ్యాపారంగా చూడలేదని.. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారని సజ్జనర్ అన్నారు.



Tags:    

Similar News