Revanth Reddy : ప్రభుత్వం పడగొడతామన్న వాళ్లను చెప్పుతో కొట్టండి

ప్రభుత్వాన్ని పడతాగొడతామని అంటున్న నేతలను మహిళలను చెప్పులతో కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు

Update: 2024-03-12 14:15 GMT

ప్రభుత్వాన్ని పడతాగొడతామని అంటున్న నేతలను మహిళలను చెప్పులతో కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన మహిళ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎలా పడగొడతామంటున్నారని ఆయన ప్రశ్నించారు. పేద మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వని కేసీఆర్ కు ఈ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పాలన్నారు. ఫాం హౌస్ లో పడుకున్న కేసీఆర్ కు తగిన రీతిలో గుణపాఠాన్ని మరోసారి చెప్పాలన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి...
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి దోచుకున్న కాడికి దోచుకుని దిగిపోయాడన్న రేవంత్ రెడ్డి తాము ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేందుకు శ్రమిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, అదే తెలంగాణను ఆ తల్లి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే చక్కదిద్దుతుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పథ్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఆ రెండు పార్టీలను ఓడించి...
కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు తన నెత్తిన పెట్టి వెళ్లారన్న రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ల చేత అనవసరంగా ఆందోళనలు చేయిస్తూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు. సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ వెళుతున్నామని తెలిపారు. బీజేపీ కూడా తప్పుడు వాగ్దానాలను చేసిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ ఏం ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ కాపాడలేకపోయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News