Congress : రేవంత్ రెడ్డిని కలిసిన కేకే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కలిశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Update: 2024-03-29 05:45 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కలిశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. ఆయన రేపు కాంగ్రెస్ లో చేరతారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేకే ఆయన కుమార్తె రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

మర్యాదపూర్వక భేటీ...
అయితే కాంగ్రెస్ అధినాయకత్వం సూచన మేరకు కె.కేశవరావు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేశవరావు మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చించుకున్నారని తెలిసింది. కేకే కుమారుడు విప్లవ్ మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని నిన్న ప్రకటించారు.


Tags:    

Similar News