Modi : వేములవాడ ఆలయంలో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. వేముల వాడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

Update: 2024-05-08 04:43 GMT

ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. వేముల వాడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన నరేంద్ర మోదీ తొలుత ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, పూజారులు మోదీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

కోడె మొక్కులను...
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేములవాడ ఆలయంలో కోడె మొక్కులు కూడా మోదీ చెల్లించుకున్నారు. మోదీ రాకతో ఆలయంవద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన వేములవాడలో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు.


Tags:    

Similar News