బీఆర్ఎస్ ఎంపీ పై కేసు నమోదు

చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2024-01-24 05:39 GMT

చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనను అనరాని మాటలతో దూషించారని, సంస్కారం లేకుండా మాట్లాడారని రంజిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

కోర్టు అనుమతితో...
న్యాయస్థానం అనుమతితో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని దానిపై దర్యాప్తును జరిపిన బంజారాహిల్స్ పోలీసులు రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


Tags:    

Similar News