మోదీకి కంకణ ధారణ చేసిన చినజీయర్ స్వామి

ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో పూజలు చేశారు. ఆయనకు చినజీయర్ స్వామి కంకణ ధారణ చేశారు

Update: 2022-02-05 12:59 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో పూజలు చేశారు. ఆయనకు చినజీయర్ స్వామి కంకణ ధారణ చేశారు. తిరునామంతో సంప్రదాయ వస్త్రాలతో మోదీ ముచ్చింతల్ కు వచ్చారు. ఆయనకు చినజీయర్ స్వామి, మై హోం రామేశ్వరరావులు స్వాగతం పలికారు. తొలుత ఆయన చేత పూజలు చేయించిన తర్వాత చినజీయర్ స్వామి 108 దేవాలయాలను మోదీ దర్శించుకున్నారు.

ఆలయాల విశిష్టతను....
ఆలయాల విశిష్టతను మోదీకి చిన జీయర్ స్వామి వివరించారు. రామానుజా చార్యుల విగ్రహాన్ని 216 అడుగులతో నిర్మించారు. వెయ్యేళ్లు ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకునేలా దీనిని నిర్మించారు. మోదీ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ లు ఉన్నారు.


Tags:    

Similar News