ఎమ్మెల్యే కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-08-02 12:15 GMT

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తాను కాని, తన ప్రజలు కాని సంతోషంగా లేమని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయలేని ఈ పదవి ఎందుకు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని సమస్యలకు తన రాజీనామాయే పరిష్కారమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజీనాా చేస్తానని తెలియగానే....
తాను రాజీనామా చేస్తానని తెలియగానే ప్రభుత్వం గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేసిందని ఃకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ విధంగానైనా నియోజకవర్గం అభివృద్ధి జరగుతుందంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడంతో సంచలనంగా మారింది.


Tags:    

Similar News