అశ్రునయనాలతో తల్లీకూతుళ్ల అంత్యక్రియలు
కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి, చందన అంత్యక్రియలు వారి స్వగ్రామం మెదక్ మండలం శివ్వాయిపల్లిలో జరిగాయి.
కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి, చందన అంత్యక్రియలు వారి స్వగ్రామం మెదక్ మండలం శివ్వాయిపల్లిలో జరిగాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం డెడ్బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్నూల్ నుంచి అంబులెన్స్లో డెడ్బాడీలు శివ్వాయిపల్లికి చేరుకుంది. తల్లీకూతుళ్లకు ఒకేసారి తండ్రి, కొడుకులు ఆనంద్ గౌడ్, శ్రీవల్లభ తల కొరివి పెట్టడం గ్రామస్తులను కంట తడి పెట్టించింది. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు తరలివచ్చారు.