అధికారులపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన యువకుడు.. జగిత్యాలలో దారుణం

దారి వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన అధికారులపై ఓ యువకుడు దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పిచికారీ చేశాడు.

Update: 2022-05-10 14:22 GMT

జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఆక్రమణను తొలగించేందుకు వచ్చిన అధికారులపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవోకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలోనే దాడి చేసి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన తిరుపతి, గంగాధర్ నడుమ కొద్దిరోజులుగా దారి వివాదం నడుస్తోంది. ఇటీవల గంగాధర్ రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి రాకపోకలు జరగకుండా అడ్డుకున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న అధికారులు కర్రలు తొలగించేందుకు వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన ఎస్సై, తహసీల్దార్, ఎంపీవోపై దాడికి దిగిన గంగాధర్ వారిపై పెట్రోల్ పిచికారీ చేశాడు. నిప్పు అంటుకోవడంతో ఎంపీవోకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News