పోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది, రెడ్‌కార్నర్ నోటీస్‌కు హైదరాబాద్‌ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

Update: 2025-01-20 04:26 GMT

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. నేరస్తుల అప్పగింత కు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలోభారత్, అమెరికా మధ్య ఒప్పందాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు.

అమెరికాకు నివేదిక....
ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సీఐడీ నివేదిక పంపింది. అమెరికాకు విదేశీ వ్యవహారాలశాఖ నివేదిక పంపనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ పొందిన ప్రభాకర్‌ రావును, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్న శ్రవణ్‌రావును భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్‌కార్నర్ నోటీస్‌కు హైదరాబాద్‌ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.


Tags:    

Similar News