హైకోర్టులో జగ్గుస్వామి పిటీషన్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని జగ్గుస్వామి హైకోర్టులో పిటీషన్ వేశారు

Update: 2022-12-03 05:05 GMT

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని జగ్గుస్వామి హైకోర్టులో పిటీషన్ వేశారు. తనకు నోటీసులు ఇవ్వడమే కాకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారని తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.

లుక్‌ అవుట్ నోటీసులు...
తనను అరెస్ట్ నుంచి తప్పించాలని, లుక్ అవుట్ నోటీసులు ఎత్తివేయాలంటూ జగ్గుస్వామి పిటీషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే బిఎల్ సంతోష్, తుషార్ లు హైకోర్టును ఆశ్రయించి మినహాయింపులను పొందారు. తాజాగా జగ్గుస్వామి కూడా హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు ముగ్గురికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ లభించింది.


Tags:    

Similar News