Telangana : నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి

తెలంగాణ బడ్జెట్ ను నేడు శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు.

Update: 2024-02-10 02:19 GMT

తెలంగాణ బడ్జెట్ ను నేడు శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆయన సభలో ప్రవేశపెడతారు. సుమారు 2.95 లక్షల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలను రూపొందించారని తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ కావడంతో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ను రూపొందించారని చెబుతున్నారు.

మూడు నెలలకు సంబంధించి...
తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీల అమలుకు తాము ఏం చేయనున్నారో కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వివరించనుంది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. మూడు నెలల కాలానికి సంబంచింది ఈ బడ్జెట్ ను రూపొందించారు. జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశముందని తెలిసింది. దీనికి ముందు తెలంగాణ మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.


Tags:    

Similar News