తెలంగాణలో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది

Update: 2023-03-28 04:07 GMT

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇది ఆందోళన కల్గించే విషయమేనని అంటున్నారు. వీటిలో హైదరాబాద్ లో ఏడు కేసులున్నాయి. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే వైరస్ ప్రమాదం పొంచి ఉందని వైద్యనిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయిం ప్రకటించే అవకాశముంది.

నిబంధనలు...
ప్రధానంగా ఇప్పటికే అన్ని షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, రద్దీ ఉన్న పర్యాటక ప్రాంతాల్లో శానిటైజర్ల వాడకం పూర్తిగా మానేశారు. తిరిగి వాటిని వినియోగించాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి కోవిడ్ నుంచి తమను తాము రక్షించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసుపత్రుల్లోనూ కోవిడ్ బెడ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.


Tags:    

Similar News