బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల నడక

వైఎస్ షర్మిలకు రాజకీయ అవగాహన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు

Update: 2022-09-26 07:02 GMT

వైఎస్ షర్మిలకు రాజకీయ అవగాహన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాత్రమే. తండ్రి బాటలో నడవకుండా కొత్త పార్టీ పెట్టడమేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆమె జగన్ వదిలిన బాణం కాదని, జగన్ వదిలేసిన బాణం అని జగ్గారెడ్డి అన్నారు. వైఎస్ పేరును దిగజార్చడానికే షర్మిల రాజకీయాల్లోకి వచ్చినట్లు కనపడుతుందన్నారు. తండ్రి పేరు వాడుకుని నాయకులు కావాలని చూస్తున్నారన్నారు. ఏపీ రాజకీయాల్లో అవకాశాలు లేవు కాబట్టే ఆమె తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారని జగ్గారెడ్డి అన్నారు.

తండ్రి పేరును...
తండ్రి బాటలో షర్మిల నడవటం లేదన్నారు. మోదీని ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒకరిని దూషించాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాడాలని జగ్గారెడ్డి హితవు పలికారు. వ్యక్తిగతంగా ఎందుకు అందరిపైనా విమర్శలు చేస్తున్నావని మండి పడ్డారు. షర్మిల బీజేపీ వదిలిన బాణంలా కనపడుతుందని ఆయన అన్నారు. నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆమెకు ఎందుకని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజల ఓట్లు కాంగ్రెస్ కు పోకుండా బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల నడుస్తుందని అన్నారు. అడ్డగోలుగా సంపాదించిన ఇద్దరూ తమ గుట్టు రట్టుకాకుండా ఉండేందుకు బీజేపీ కంట్రోల్ లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News