జగ్గారెడ్డిపై సోనియా సీరియస్

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా సీరియస్ అయ్యారు.

Update: 2022-02-20 04:55 GMT

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా సీరియస్ అయ్యారు. పార్టీ నుంచి వైదొలుగుతూ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియాతో మాట్లాడి ప్రయోజనం ఏంటని అన్నారు. మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని, ఏదైనా పార్టీ విషయాలను స్వేచ్ఛగా, నిజాయితీగా పార్టీలోపల చర్చించుకుందామని సోనియా అభిప్రాయపడ్డారు. మీడియాకు తెలియజేసేది కేవలం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమిష్టి నిర్ణయాలేనని అన్నారు.

రాజీనామా.....
కాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. ఈవిషయాలను మీడియా ద్వారా తెలియపర్చారు. కాంగ్రెస్ లో ఒక వర్గం తనను టార్గెట్ చేసిందని, తనను టీఆర్ఎస్ కోవర్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని జగ్గారెడ్డి తెలిపారు. తాను పార్టీలో ఇమడలేనని కూడా లేఖలో పేర్కొన్నారు. దీనిపై సోనియా గాంధీ స్పందించారు.


Tags:    

Similar News