Modi : కేంద్రం గుడ్ న్యూస్... ఇక వారి కోరిక నెరవేరినట్లేనా?

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2024-01-19 06:37 GMT

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర కేబినెట్ కారయదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయనతో పాటు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.

కమిటీని నియమిస్తూ...
ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుగా కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయశాఖ కార్యదర్శులు కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొంది. తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఈ ఉత్తర్వులు జారీ చేసిందన్న రాజకీయ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ హైదరాబాద్ లో గతంలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News