KTR : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ రాజేంద్ర నగర్ లో జరిగే ఉప ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఖాయమని ఆయన చెప్పారు. దీంతో అభిమానులు పెద్దయెత్తున హర్షధ్వనాలు చేశారు.
హామీలు అమలు చేయకపోవడంతో...
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఇకపై ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయమని తెలిపారు. కార్తీక రెడ్డి విజయానికి అందరూ పనిచేయాలని కూడా కేటీఆర్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ వర్గమూ సంతృప్తిగా లేదని తెలిపారు.