పార్లమెంటు ఎదుట బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీలుు ఆందోళనకు దిగారు. అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

Update: 2023-03-17 06:29 GMT

పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు పెద్దయెత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

అదానీ వ్యవహారంపై...
పార్లమెంటు ప్రారంభమయిన వెంటనే బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అదానీని ఈ ప్రభుత్వం వెనకేసుకు వస్తుందని, అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుల నినాదాలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. మోదీ-అదానీ పేర్లను కలిపి మోదానీ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎంపిల ధర్నాకు కొందరు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతు తెలిపారు.


Tags:    

Similar News