KCR : నేడు జగిత్యాలకు కేసీఆర్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు జగిత్యాలలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

Update: 2024-05-05 02:50 GMT

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు జగిత్యాలలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ గత నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన పర్యటనలు చేస్తున్నారు.

రోడ్ షోలతో పాటు...
ఈరోజు జగిత్యాలలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయన అక్కడ రోడ్ షో చేయడంతో పాటు కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. సంక్షేమ పథకాలను నిలపేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటూ కేసీఆర్ పిలుపునిస్తూ ఈపర్యటనలు చేస్తున్నారు.


Tags:    

Similar News