రేవంత్‌ రెడ్డి కొత్త బిచ్చగాడు.. రాజగోపాల్‌రెడ్డి సంచలన కామెంట్స్

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోటిమరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ నుంచి

Update: 2023-05-22 11:42 GMT

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోటిమరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ నుంచి ఇద్దరు ముగ్గురు జైలుకు వెళ్లడం ఖాయమని, దానికి ఎంతో సమయం లేదని, అది ఒక నెలలోనే జరుగుతుందని పెద్ద బాంబు పేల్చారు. హైదరాబాద్‌లోని చంపాపేటలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని కొత్త బిచ్చగాడిగా అభివర్ణించారు. రేవంత్‌ రెడ్డే ఒక వలసవాది అని, ఆయన తమలాంటి వాళ్లను తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్యానించడం కామెడీగా ఉందని పేర్కొన్నారు.

రేవంత్‌ రెడ్డి బీజేపీలో వస్తామన్నా.. ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎందుకంటే ఆయనపై ఉన్న కేసులను పరిశీలించాల్సి ఉంటుందని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. మంచి పేరు తెచ్చుకుని, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వారిని మాత్రమే బీజేపీలోకి చేర్చుకుంటుందన్నారు. తాము ఒకే ఉద్దేశ్యంతో బీజేపీలో జాయిన్‌ అయినట్లు రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. తాను బీజేపీని విడిచి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీలో కొత్తగా చేరిన వారికి ఛాన్స్‌ ఇవ్వాలని, దీంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న తన అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలకు వివరించానని తెలిపారు.

అవినీతిపరులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఆధారాలు కావాలంటే తాము ఇస్తామని బీజేపీ అగ్రనాయకత్వానికి చెప్పాం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం బలమైన సరైన పద్ధతిలో వాడుకోవాలన్నదే తమ అభిప్రాయమని రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. తమ పార్టీలో చేరాలంటూ.. ఇతర పార్టీల నేతలను బహిరంగంగానే ఆహ్వానించుకుంటున్నారు కొందరు నేతలు. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన వారంతా మళ్లీ కాంగ్రెస్‌లోకి చేరాలని రేవంత్‌ రెడ్డి బహిరంగంగా ఆహ్వానించారు. 

Tags:    

Similar News