ఇంట్లోనే బండి సంజయ్ దీక్ష

కరీంనగర్ లో బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ లోని తన సొంత ఇంట్లో ఆయన దీక్ష చేపట్టనున్నారు.

Update: 2022-08-24 03:15 GMT

కరీంనగర్ లో బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ లోని తన సొంత ఇంట్లో ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ దీక్ష చేయాలని బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. బండి సంజయ్ పాదయాత్రను పోలీసులతో అడ్డుకోవడంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. యాత్ర శాంతియుతంగా చేస్తున్నప్పటికీ టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తారన్న ప్రచారంతో యాత్రను నిలిపి వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

అక్రమంగా అరెస్ల్....
బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, యాత్రను నిలిపివేయడంపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. పాదయాత్రకు తిరిగి అనుమతివ్వాలని కోరుతున్నారు. నిన్న బీజేపీ నేతలు గవర్నర్ ను కలసి యాత్రపై ఆంక్షలు విధించడంపైన ఫిర్యాదు చేశారు. ఈరోజు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు దీక్ష చేయనున్నారు.


Tags:    

Similar News