Aandesree: అందెశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో

ప్రముఖ రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు

Update: 2025-11-10 04:18 GMT

ప్రముఖ రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయహే తెలంగాణ గీతం రచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ ఇటీవల ప్రభుత్వం నుంచి రూ.కోటి పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ను పొందారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం లభించింది.

అనేక అవార్డులు...
అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ ను అందెశ్రీ పొందారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని అందెశ్రీ అందుకున్నార. 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది. 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం దక్కింది. లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్న అందెశ్రీ ఈరోజు ఉదయం 7:25కి అందెశ్రీ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.


Tags:    

Similar News