నేడు దత్తన్న అలయ్ బలయ్... హాజరు కానున్న మెగాస్టార్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు

Update: 2022-10-06 04:01 GMT

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు అలయ్ భలయ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ప్రతి ఏడాది దసరా పండగ మరుసటి రోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ భలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతి ఏడాది....
ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల రాజకీయ నేతలు హాజరవుతారు. అందరూ కలసి సరదాగా కొద్దిసేపు కలిసి ముచ్చటించుకుంటారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ జరుపుతారు. ఈసారి ఈ కార్యక్రమంలో చిరంజీవిని దత్తాత్రేయ సన్మానించనున్నారు. నిన్న చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించడంతో ఆయన వస్తానని చెప్పారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News