నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది
నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారుల ఎదుట లొంగిపోవాని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆయనను శారీరకంగా వేధించకుండా కేవలం దర్యాప్తు మాత్రమే కొనసాగించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోర్టుకు సీల్డ్ కవర్ లో...
ప్రభాకర్రావు విచారణ అంశాలతో నేడు కోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక అందించనుంది. ప్రభాకర్ రావుకు ఇంటి నుంచి భోజనాన్ని కూడా అనుమతించాలని కోరింది. ఆయన ముందస్తు బెయిల్ పై నేడు మరోసారి విచారణ చేయనుంది. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరుపున ప్రభాకర్ రావు విచారణలో పేర్కొన్న అంశాలను నివేదించే అవకాశాలున్నాయి.