నేడు సిట్ ఎదుటకు సంతోష్ రావు
బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు
బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు సంతోషరావుకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు మధ్య్యాహ్నం సంతోష్ రావును విచారించనున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో వరసగా సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో సంతోష్ రావును కూడా విచారించాలని సిట్ నిర్ణయించింది.
విచారణకు రావాలని...
ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లను ఈ కేసులో విచారణ చేశారు. ఉదయం నుంచి రాత్రి ఆరు గంటల వరకూ వారిని విచారించారు. నేడు సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు ప్రమేయం కూడా ఉందని కొందరు విచారణ సందర్భంగా వెల్లడించడంతోనే విచారణ చేస్తున్నామని సిట్ అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని బృందం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.