ప్రధాని మోదీని ప్రశ్నించిన కమల్ హాసన్
ఈ విషయమై మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
kamal questions modi on new parliament
ప్రధాని మోదీ ఆదివారం (మే 28) పార్లమెంటు కొత్త భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభోత్సవం విషయమై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు విపక్షాలు ప్రకటించాయి. కొత్త పార్లమెంటును అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎందుకు హాజరు కాకూడదని ఆయన ప్రశ్నించారు. దేశం గర్వించదగ్గ ఈ క్షణం.. రాజకీయంగా చిచ్చు రేపిందని కమల్ హాసన్ అన్నారు. నేను ప్రధానమంత్రిని ఒక సాధారణ ప్రశ్న అడుగుతున్నాను.. దయచేసి దేశానికి సమాధానం చెప్పండి. మన కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ఎందుకు హాజరు కాకూడదు? అంటూ ప్రశ్నించారు.