హాట్ టాపిక్‌గా సీఎం జగన్ స్కెచ్!

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ గీసిన మాస్టర్‌ స్కెచ్.. టీడీపీ వర్గాలకు నిద్ర లేకుండా చేస్తోంది. టీడీపీ యువ నాయకుడు

Update: 2023-05-30 12:44 GMT

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ గీసిన మాస్టర్‌ స్కెచ్.. టీడీపీ వర్గాలకు నిద్ర లేకుండా చేస్తోంది. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ టార్గెట్‌గా సీఎం జగన్‌ భారీ స్కెచ్‌ వేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్‌ మరోసారి ఓడిపోయేలా అస్త్రం సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్‌ 5300 ఓట్ల తేడాతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయారు. ఎన్నికలకు మరో ఏడాదే సమయం మిగిలి ఉంది. ఈ క్రమంలోనే లోకేష్‌కు పొలిటికల్‌ ఫ్యుచర్‌ లేకుండా వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే ఇటీవల అమరావతి రాజధాని భూములను 50 వేల మందికి సెంటు చొప్పున భూమి పంపిణీ చేశారు. అక్కడ పేదలకు ఇళ్లు కూడా కట్టిస్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యేలా సీఎం జగన్‌ భారీ ప్లాన్‌ రెడీ చేయడం రాజకీయవర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. మంగళగిరిలో లోకేష్‌ను ఓడించడం ద్వారా అతనికి పొలిటికల్‌ ఫ్యుచర్‌ లేకుండా చేయడం, తాడికొండలో గెలవడం ద్వారా రాజధాని అమరావతి ప్రజలు తమ పార్టీని ఆదరించారని చాటుకోవడమే టార్గెట్‌గా సీఎం జగన్‌ వ్యూహాం సిద్ధం చేస్తున్నారు.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వైఎస్‌ జగన్‌ పావులు కదుపుతున్నారు. ఎన్నికల సమయానికి రాజధాని అమరావతిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గుంటూరు, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించనున్నారు. ఆ తర్వాత వారికి అక్కడే ఓట్లు నమోదు చేయనున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో అప్పటి వరకు ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కష్టమనే చెప్పాలి. 

Tags:    

Similar News