ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో..

టీడీపీ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌ రావుపై ప్రశంసలు కురిపించడంపై టీడీపీ నాయకుడు

Update: 2023-05-25 07:48 GMT

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్య.. ప్రజల సమస్యలు తీర్చడంతో పాటు, ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, ఇప్పుడు సౌమ్యకు అవినీతి మరక అంటలేదని అన్నారు. ఆమె తన పెన్షన్‌ డబ్బులతో జీవనం సాగిస్తున్నారని, అవినీతికి ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు. నందిగామలో మొండితోక జగన్మోహన్‌ రావు బ్రదర్స్‌ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అవినీతిని బయటపెట్టిన వారిపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వీటన్నింటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల టీడీపీ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌ రావుపై ప్రశంసలు కురిపించడంపై టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న పరోక్షంగా స్పందించారు. కేశినేని వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఇది తన ఆలోచన అని, తెలుగు దేశం పార్టీకి నష్టం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు తాను చేయనని చెప్పారు. మొండితోక జగన్మోహన్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఇది తన కౌంటర్ అని అన్నారు.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి వయస్సును లెక్క చేయకుండా వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నాని బుద్ధా మండిపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఫ్యాక్షన్‌ సీఎం ఇలాకాలో పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. అవినీతి పరుడైన జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసుపై బుద్ధా మాట్లాడుతూ.. ఈ హత్యకు వైఎస్‌ అవినాష్‌ పాత్రధారి అని, సీఎం జగన్‌ సూత్రధారి అని ఆరోపించారు. కన్నతల్లిని అడ్డం పెట్టుకుని అవినాష్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ అధికారులకు ఏపీ పోలీసులు సహకరించకపోవడం దారుణమన్నారు. 

Tags:    

Similar News