ఎనిమిదేళ్ల పాలనలో ఒరగబెట్టింది ఏమిటి ?- కేసీఆర్ కు బండి సంజయ్ 21 ప్రశ్నలు !

2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేసి, రాష్ట్ర ప్రజలకు అనేక హామీలిచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో

Update: 2022-04-27 06:58 GMT

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది టిఆర్ఎస్. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అస్య‌తాలు చెబుతూ ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ఎనిమిదేళ్ల పాలనలో మీరు ఒరగబెట్టింది ఏమిటో మూడున్నర కోట్ల రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు.. మీకు నిజం చెప్పకూడదు అన్న శాపం ఏమైనా ఉందా? కనీసం మీ పార్టీ ఘనంగా జరుపుకుంటున్న 21వ ప్లీనరీ సందర్భంగా అయినా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మేము అడిగే 21 ప్రశ్నలకైనా కనీసం మీరు సమాధానం చెప్పాలి అంటూ ఓ ప్ర‌క‌ట‌న‌లో బండి సంజ‌య్ పేర్కొన్నారు.


2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేసి, రాష్ట్ర ప్రజలకు అనేక హామీలిచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కనీసం ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ఆయ‌న‌ నిలదీశారు. ఇంటికో ఉద్యోగమిస్తానని వాగ్దానం చేసి, మీ కుటుంబంలో మాత్రమే ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చారని, ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. అలాగే నిరుద్యోగ భృతి రూ.3,016 లు ఇప్పటి వరకూ ఎంతమంది విద్యావంతులకు ఇచ్చారు? ఇవ్వకపోతే ఎప్పటి నుంచి ఇస్తారు ? అని ప్రశ్నించారు. బీసీ బంధు పథకాన్ని ఎప్పట్నుంచి ప్రవేశపెడతారు ? రైతుల రుణమాఫీలు ఎంతవరకూ చేశారు ? ఇలా బండి సంజయ్ కేసీఆర్ కు 21 ప్రశ్నలు వేసి, వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



 





Tags:    

Similar News