రాత మారింది.. గిరిజ‌న కార్మికుడికి దొరికిన 40లక్షల వ‌జ్రం

మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాలకు నిలయంగా ప్రసిద్ధి పొందింది.

Update: 2025-07-10 11:15 GMT

మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాలకు నిలయంగా ప్రసిద్ధి పొందింది. కొన్ని లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. అందుకే అక్కడ కూలీలు, కార్మికులు వజ్రాల వేట సాగిస్తుంటారు. తాజాగా ఓ గిరిజ‌న కార్మికుడికి అదృష్టం వరించింది. మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాలో గిరిజన కార్మికుడు మాధవ్‌కి సుమారు 40 లక్షల విలువైన 11.95 క్యారెట్ల వజ్రం దొరికింది. కృష్ణ కల్యాణ పట్టి ప్రాంతంలోని ఓ గనిలో పని చేస్తుండగా అతను వజ్రాన్ని గుర్తించాడు. నిబంధనల ప్రకారం వజ్రాన్ని పన్నా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేయగా, త్వరలో వేలం వేయనున్నారు. వచ్చిన డబ్బులో 12.5 శాతం రాయల్టీ తీసి మిగిలిన మొత్తాన్ని కార్మికుడికి అందించనున్నారు.

Tags:    

Similar News