చల్లగా ఉండాలయ్యా స్టాలిన్

సినీ నటి వాణిశ్రీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ అండగా నిలిచారు. ఆమె స్థలం చెన్నైలో కబ్జాకు గురయింది.

Update: 2022-09-29 07:19 GMT

సినీ నటి వాణిశ్రీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ అండగా నిలిచారు. ఆమె స్థలం చెన్నైలో కబ్జాకు గురయింది. 11 ఏళ్ల క్రితం కబ్జా కు గురైన ఈ స్థలం కోసం వాణిశ్రీ అన్ని పోరాటాలు చేశారు. వాణిజ్య స్థలం కావడంతో అత్యంత ఖరీదయింది. దీంతో వాణిశ్రీ ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఆశ్రయించారు.

కోట్ల విలువైన భూమిని...
అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ చొరవతో కబ్జాకు గురయిన భూమిని విడిపించారు. నకిలీ పత్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను రద్దు చేసే చట్టాన్ని స్టాలిన్ తీసుకువచ్చారు. వాణిశ్రీ స్థలాన్ని కూడా ఐదుగురు కబ్జాదారుల నకిలీ పత్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిని రద్దు చేసి ఆ స్థలాన్ని తిరిగి స్టాలిన్ వాణిశ్రీకి అప్పగించారు. స్టాలిన్ నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని వాణిశ్రీ ఈ సందర్భంగా స్టాలిన్ ను ఆశీర్వదించారు.


Tags:    

Similar News