Breaking : రాహుల్ పర్యటన - జమ్మూ కాశ్మీర్ లో వరస పేలుళ్లు

జమ్మూ కాశ్మీర్ లో వరస పేలుళ్లు సంభవించాయి. నర్వాల్ ఏరియాలో వరస బాంబు పేలుళ్లు జరిగాయి.

Update: 2023-01-21 06:28 GMT

జమ్మూ కాశ్మీర్ లో వరస పేలుళ్లు సంభవించాయి. నర్వాల్ ఏరియాలో వరస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వరస బాంబు పేలుళ్లు ఎవరి పని అన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

రాహుల్ పర్యటన ఉండటంతో...
అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ లోకి అడుగు పెట్టింది. ఈ సమయంలో ఆ రాష్ట్రంలో వరస బాంబు పేలుళ్లు జరగడంతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూలో వరస బాంబు పేలుళ్లతో రాహుల్ గాంధీ భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నేతలు కోరుతున్నారు.


Tags:    

Similar News