రెండోరోజూ ఐటీ దాడులు

తమిళనాడు, కర్ణాటకలో రెండోరోజు ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది. జీ స్క్కేర్ సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు

Update: 2023-04-25 04:53 GMT

తమిళనాడు, కర్ణాటకలో రెండోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జీ స్క్కేర్ సంస్థల్లో ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.

జీ స్క్కేర్ సంస్థల్లో....
చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరులోని జీ స్క్కేర్ సంస్థల్లో ఈ సోదాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. జీ స్క్కేర్ సంస్థల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ బంధువులకు పెట్టుబడులున్నాయంటూ బీజేపీ చీఫ్ అన్నామలై ఆరోపించిన నేపథ్యంలో వరసగా రెండోరోజు కూడా దాడులు జరుగుతుండటం విశేషం.


Tags:    

Similar News