అహ్మదాబాద్ లో నేడు మోదీ రోడ్ షో

ఈరోజు గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో రోడ్ షోలో పాల్గొంటారు

Update: 2022-03-11 06:02 GMT

నాలుగు రాష్ట్రాలను గెలుచుకున్న ఊపు మీదున్న బీజేపీ దేశ వ్యాప్తంగా విజయోత్సవాలను నిర్వహించుకుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో రోడ్ షోలో పాల్గొంటారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం శ్రీకమలం వరకూ ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో నాలుగు లక్షల మంది ప్రజలు పాల్గొననున్నారు.

స్థానిక ప్రతినిధులను.....
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో మోదీకి ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పార్టీ శ్రేణులు భారీ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ లోని జీఎండీసీ గ్రౌండ్ లో ఆయన స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి 1.38 లక్షల మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.


Tags:    

Similar News