నేడు 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం తర్వాత వాటిని తిరిగి ప్రారంభించనున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం తర్వాత వాటిని తిరిగి ప్రారంభించనున్నారు. వర్చువల్ గా జరగనున్న కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దన రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్లను నిర్మించారు. అమృత్ భారత్ స్టేషన్ యోజన కింద ఈ రైల్వే స్టేషన్ల ఆధునికీరణ పనులు చేపట్టార.
తెలంగాణలోనూ...
దేశంలో దాదాపు పది రాష్ట్రాల్లో ఉన్న నూట మూడు రైల్వే స్టేషన్లను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. రైల్వేస్టేషన్ల వద్ద పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. తెలంగాణ నుంచి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లన్నీ అమృత భారత్ స్టేషన్ యోజనలో భాగంగా రీడిజైన్ చేసి, అత్యాధునికంగా తీర్చిదిద్దారు.